తడాఖా చూపిన భారత సైన్యం
పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంగిస్తూ………
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత సైన్యం ఈరోజు దీటైన జవాబునిచ్చింది.
నిన్న రాత్రి నుంచి సరిహద్దుల్లోని పలు సెక్టార్లలో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది.
జమ్మూ , కత్వా జిల్లాల్లోనూ , సుందర్భానీ , పల్లన్వాలా , రాజౌరీ సెక్టార్లలో
పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందగా , ఒక బాలిక తీవ్రంగా గాయపడింది.
దానికి ప్రతి స్పందనగా……..
నౌషేరా , హీరానగర్ సెక్టార్లలో తెల్లవారు జాము నుండి భారత సైన్యం పాక్ పై విరుచుకుపడింది.
సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతున్న 15 మంది పాక్ రేంజర్లను భారత సైన్యం మట్టుబెట్టింది.
ఒకేసారి అంత మంది సైనికులను పోగొట్టుకున్న పాక్ వెనక్కు తగ్గింది.
Leave a Comment
Your feedback is valuable for us. Your email will not be published.